ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే.. మరోవైపు అన్ని పార్టీలలో నేతల జంపింగ్లు ఎక్కువ అవుతున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ కోసం పని చేస్తూ..చివరకు తమకు టికెట్లు ఇవ్వకపోవడంతో అసంతృప్తికి లోనయిన నేతలు కొంతమంది ఇప్పటికే ఇతర పార్టీలకు జంప్ అవగా.. మరికొంతమంది పార్టీ మారడానికి సిద్దమైపోతున్నారు.
ఏపీలో వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ల మార్పుల తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేయగా.. తాజాగా ఇదే వరుసలో మరో ఎమ్మెల్యే చేరిపోయి..టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జ్ ల మార్పుల్లో తిరువూరు సీనియర్ ఎమ్మెల్యే.. కొక్కిలిగడ్డ రక్షణనిధి సీటు కోల్పోయారు. రక్షణనిధి స్ధానంలో టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని వెంట వచ్చిన నల్లగట్ల స్వామిద్వాస్.. ఇన్ ఛార్జ్ గా నియమించబడ్డారు. రక్షణనిధి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడటంతో.. ఆయన కొంతమంది టీడీపీ నేతలతో చర్చలు జరపారట. అవి ఫలించడంతో త్వరలోనే వైసీపీని వీడి సైకిల్ ఎక్కడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి ఫిబ్రవరి 26న టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తిరువూరు టికెట్ గురించి టీడీపీ నేతలతో చర్చించగా.. ఈ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కొలికపూడి శ్రీనివాస్, దేవదత్తో పాటు కొంతమంది తిరువూరు రేసులో ఉన్నా కూడా.. వీరందిరినీ కాదని రక్షణనిధికి టికెట్ కేటాయించడానికి చంద్రబాబు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE