ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరియు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిలు ఈరోజు నెల్లూరులో పర్యటించారు. ఈ క్రమంలో జిల్లా త్రాగునీరు, సాగునీరు అవసరాల కోసం నిర్మిస్తున్న పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారులకు నిర్మాణానికి సంబంధించి సూచనలు చేశారు. జిల్లా ప్రజల అవసరాలతో పాటు అకాల వర్షాలు మరియు అత్యధిక వర్షపాతం కారణంగా ఏర్పడే వరదల నివారణకు తోడ్పడేలా ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టినట్లు మంత్రులు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ బ్యారేజీలకు శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం పెన్నా బ్యారేజీ పనులు 90 శాతం పైనే పూర్తయ్యాయని వెల్లడించారు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి, సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం చేయిస్తామని మంత్రులు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ