ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 12,926 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 5 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 1959, చిత్తూరులో 1566, అనంతపూర్ లో 1379, గుంటూరులో 1212, ప్రకాశంలో 1001 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జనవరి 22, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,66,194కు, మరణాల సంఖ్య 14538కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3,913 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,78,513 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 73,143 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(12,926):
- విశాఖపట్నం – 1959
- చిత్తూరు – 1566
- అనంతపూర్ – 1379
- గుంటూరు – 1212
- ప్రకాశం – 1001
- కర్నూల్ – 969
- నెల్లూరు – 875
- శ్రీకాకుళం – 868
- తూర్పుగోదావరి – 756
- కడప – 734
- పశ్చిమగోదావరి – 691
- విజయనగరం – 562
- కృష్ణా – 354
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF