ఆంధ్రప్రదేశ్ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు (మంగళవారం) ప్రారంభం అయ్యాయి. నేటి సమావేశాల్లో భాగంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సంతాప తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది. అదేవిధంగా ఉదయం శాసన మండలిలో గౌతమ్రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానంపై చర్చ అనంతరం శాసన మండలి వాయిదా పడనుంది. ఈ నెల 25వ తేదీ వరకు శాసన సభ నిర్వహించాలని బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. అదేవిధంగా.. 9వ తేదీన గౌతమ్రెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 10వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, చర్చ జరగనుంది. గౌతమ్రెడ్డి సంతాప తీర్మానంపై పలువురు సభ్యులు తమ ప్రసంగాన్ని వినిపించారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ – గౌతమ్రెడ్డి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం
మంత్రి పెద్దిరెడ్డి – గౌతమ్రెడ్డి సౌమ్యుడు, సమర్ధుడు
మంత్రి బాలినేని – బంగారం లాంటి మనిషిని రాష్ట్రం కోల్పోయింది.
ఎమ్మెల్యే ఆర్కే రోజా – గౌతమ్ అజాతశత్రువు, ప్రతిపక్షాల మెప్పు సైతం పొందిన వ్యక్తి
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ