ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి సోమవారం వరుసగా మూడో రోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాసనసభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. వెల్లోకి దిగి సభా కార్యకలాపాలను స్తంభింపజేసినందుకు టీడీపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వీరిపై ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టడంతో స్పీకర్ సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్టు అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఈ చర్చలో పాల్గొన్న సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టుపై పాయింట్ ప్రజెంటేషన్తో వివరణ ఇచ్చారు. అనంతరం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ర్గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ జరుగుతుండగా అడ్డుకున్న టీడీపీ సభ్యులు రైతుల సమస్యలపై చర్చకు అవకాశమివ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో వారు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో టీడీపీ శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. పలుమార్లు హెచ్చరించినా వారు తమ స్థానాలకు తిరిగి వెళ్లకపోవడంతో స్పీకర్ తమ్మినేని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఒకరోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY