దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,919 పాజిటివ్ కేసులు, 470 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,78,517 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,64,623 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మిజోరాం, కర్ణాటక, అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 11,242 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,38,85,132 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.28 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.35 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 1,28,762 (0.37%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (నవంబర్ 16 (8am)– నవంబర్ 17 (8am)):
- కేరళ – 6,849
- మహారాష్ట్ర – 1,003
- వెస్ట్ బెంగాల్ – 862
- తమిళనాడు – 782
- మిజోరాం – 570
- కర్ణాటక – 308
- అస్సాం – 250
- ఆంధ్రప్రదేశ్ – 230
- ఒడిశా – 226
- జమ్మూ అండ్ కశ్మీర్ – 168
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ