ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే పలు అంశాలకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు పొడియం వద్ద నినాదాలు చేశారు. పొడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటానని సభాపతి చెప్పటంతో టీడీపీ సభ్యులు తమ స్థానాలవద్ద నుంచే నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 4గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. రామరాజు, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, అనగాని సత్యప్రసాద్లను సభ నుంచి సస్పెండ్ చేశారు. కాగా వీరిని ఈ అసెంబ్లీ సెషన్ ముగిసేవరకు (ఈనెల 25 వరకు) సస్పెండ్ చేయటం గమనార్హం. మిగిలిన టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ