తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి పలు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. అందులో భాగంగా తొలిరోజున మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కెమ్ వేద లైఫ్ సైన్సెస్ సంస్థ నాయకత్వ బృందంతో సమావేశమైంది. ఈ సమావేశం తరువాత, హైదరాబాద్లో 500 మంది శాస్త్రవేత్తలకు ఉపాధిని కల్పించే దిశగా అత్యాధునిక ఆర్ అండ్ డీ కేంద్రాన్ని జోడించడానికి రూ. 150 కోట్ల పెట్టుబడిని కెమ్ వేద సంస్థ ప్రకటించింది.
ఈ సమావేశంలో కెమ్ వేద లైఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్, సీఈఓ డాక్టర్ భీమా పరసెల్లి, సలహాదారు ప్రొఫెసర్ ఫిల్ఎస్ బరన్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా ఉందని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో తెలిపారు. తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్న కెమ్ వేద లైఫ్ సైన్సెస్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కెమ్ వేద లైఫ్ సైన్సెస్ హైదరాబాద్ అండ్ శాన్ డియాగోలలో ప్రధాన కార్యాలయం కలిగిన మధ్యతరహా ఒప్పంద పరిశోధన సంస్థ. ఇది ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్ పరిశ్రమలకు మరియు విద్యారంగానికి పరిష్కారాలను అందిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ