ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం అక్టోబర్ 16, బుధవారం నాడు సమావేశమయింది. ఉదయం 11 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై చర్చించనున్నారు. అంతే కాకుండా కొత్త సంక్షేమ పథకాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు, వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు ఉచిత బోరుబావుల ఏర్పాటు, మిల్లెట్ బోర్డు, వైఎస్ఆర్ ల్యాబ్స్ వంటి పలు అంశాలపై మంత్రి మండలి చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. చేనేత కుటుంబాలకు ఏడాదికి 24 వేల సాయంపై విధివిధానాలు, ఇసుక రవాణాలో యువతకు ఉపాధి కార్యక్రమాలు, ఉద్దాన ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు, రైతు భరోసా పథకం కింద రైతులకు పెంచిన సహాయాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేయడం వంటి పలు అంశాలును మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది.
[subscribe]