ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, థర్డ్ వేవ్పై సన్నద్ధత, వ్యవసాయం-ఖరీఫ్ పంటల ఏర్పాట్లు, సాగు నీటి ప్రాజెక్టులు, నగరాలు, పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయింపుపై విధివిధానాలు, ఐటీ పాలసీ, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణ, 104 వాహనాల కొనుగోలు, విజయనగరం, ఒంగోలులో యూనివర్సిటీలు ఏర్పాటు, రాష్ట్రంలో అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సహా పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ