ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 6, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆగస్టు 10న అమలు చేయనున్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం, నూతన విద్యా విధానం ప్రకారం స్కూల్స్ వర్గీకరణ, జగనన్న విద్యాకానుక, నాడు-నేడు పథకం, పోలవరం నిర్వాసితుల ఆర్అండ్ఆర్ చెల్లింపులు, అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లాప్ పథకం, రాష్ట్రంలో కరోనా నియంత్రణ, థర్డ్ వేవ్పై సన్నద్ధత, సాగు నీటి ప్రాజెక్టులు, రాష్ట్రంలో అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ