ఏపీలోని గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమీక్షలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి, గృహనిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకి ఆయన పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చేసిన కీలక సూచనలు..
- దరఖాస్తు చేసిన 90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి.
- జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణాల కోసం ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలి.
- ఆప్షన్ 3 కింద ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే మొదలు పెట్టాలని ఆదేశం.
- జగనన్న కాలనీలు మురికి కూపాలుగా మారకుండా, వనరుల విషయంలో దృష్టి సారించాలని సూచన.
- జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, నీటి సరఫరా అంశాలపై దృష్టి సారించాలి.
- ఇళ్ళ నిర్మాణాల కోసం ఇటుకల తయారీ యూనిట్లను కాలనీలకు సమీపంలోనే పెట్టుకున్నారా? లేదా? అని పర్యవేక్షించాలి.
- ఆగస్టు మొదటి వారం నాటికి కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్ల పట్టాలపై ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంకావాలి.
- కరెంటు కష్టాలు లేకుండా ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్లైట్లు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి.
- ఇంటి స్థలం విషయంలో పట్టా, డాక్యుమెంట్లు ఇచ్చినట్లు లబ్ధిదారుల నుంచి అధికారులు ధృవీకరణ తీసుకోవాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ