ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా నవంబర్ 30వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదించాల్సి బిల్లులుపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో నివర్ తుఫాన్ ప్రభావం, ఇళ్ల పట్టాల పంపిణీ సహా రాష్ట్రంలో అమలు చేయనున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలుపై ఈ కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ