జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా గురువారం నాటికీ 87393 పొలిటికల్ బ్యానర్లు/పోస్టర్లను తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు రాజకీయ పార్టీలకు చెందిన 12493 బ్యానర్లు, 16041 పోస్టర్లు, 4231 బోర్డ్స్, 16977 ఫ్లెక్సీలు, 37651 జెండాలు తొలగించినట్టు వెల్లడించారు. అనుమతి లేకుండా వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటుచేసే బ్యానర్ల తొలగింపుకు 20 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. అలాగే ఇప్పటిదాకా రూ.1,40,88,950 నగదును, రూ.11,80,140 విలువ చేసే నిషేధిత మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ