గుజరాత్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్కోట్లోని మావ్డీ ప్రాంతంలో కరోనా పేషంట్లకు చికిత్స అందిస్తున్న శివానంద్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 30 మందికి పైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. కాగా ఈ దుర్ఘటనలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలంలో నాలుగురు చనిపోగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మరో ఇద్దరు చనిపోయినట్టు తెలిపారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. మిగతా కరోనా బాధితులను సురక్షితంగా కాపాడి సమీపంలోని ఇతర కోవిడ్ సెంటర్లకు, ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని అధికారులను గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ