ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తాడేపల్లిగూడెం మండలం కడియద్దలోని ఒక బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. అలాగే మరికొంత మందికి గాయాలయ్యాయి. కాగా పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడినవారికి మెరుగైన వ్యాద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం జగన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE