ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాకు నిన్న (శుక్రవారం) విచ్చేసిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా రెండవ రోజు పట్టణంలోని పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కడప పర్యటనలో మొదటగా శుక్రవారం సాయంత్రం ఒంటిమిట్ట ‘సీతారామ కల్యాణ’ మహోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రాములవారికి సమర్పించిన సీఎం జగన్ అనంతరం సీతారాముల కల్యాణాన్ని తిలకించారు. ఆ తర్వాత టీటీడీ అతిథి గృహానికి చేరుకుని రాత్రికి బస చేశారు. తిరిగి ఈరోజు ఉదయం కడపలో స్థానికంగా జరిగిన పలు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. పట్టణంలోని రెండు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నంద్యాల జాయింట్ కలెక్టర్ మౌర్య మరియు మేయర్ సురేష్ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ