తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లోని మెడికల్ డివైజెస్ పార్కులో నెలకొల్పిన సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్ఎంటీ) ఉత్పత్తి కర్మాగారము మరియు ఆర్ అండ్ డి కేంద్రాన్ని ప్రారంభించారు. ఎస్ఎంటీ సంస్థ ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థగా ఉంది. ఈ ఎస్ఎంటీ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం రూ.530 కోట్లు కాగా, రాష్ట్రంలో దాదాపు 2000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనుందని తెలిపారు.
అలాగే ఈ సంస్థ నెలకొల్పే గ్లోబల్ ఆర్ అండ్ డి సెంటర్ ద్వారా 300 మంది అత్యంత అర్హత కలిగిన శాస్త్రవేత్తలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహజానంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ధీరజ్ లాల్ కోటాడియా, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ అండ్ ఎండి నర్సింహారెడ్డి, తెలంగాణ స్టేట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ