ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ ముందుగా గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్ తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, పలు సంక్షేమ పథకాల అమలు సహా కీలక అంశాలపై సీఎం చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో పాటుగా ఇతర రాష్ట్ర సంబంధిత అంశాలపై గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం వైఎస్ జగన్ చర్చించినట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY