భారత క్రికెట్ జట్టులోకి ఆంధ్రా ఆటగాడు కోన శ్రీకర్ భరత్ అరంగేట్రం చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గురువారం అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ను ఆయన అభినందించారు. ఈ మేరకు భరత్ తన తల్లితో సంతోషాన్ని పంచుకుంటున్న ఫోటోను తన ట్విటర్లో షేర్ చేసిన సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా.. ‘మా ఆటగాడు కోన భరత్, ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో భారత క్రికెట్ జట్టు తరపున ఈరోజు అరంగేట్రం చేస్తున్నాడు. ఆయనకు నా అభినందనలు మరియు శుభాకాంక్షలు. తెలుగు జెండా రెపరెపలాడుతోంది’ అని సీఎం జగన్ అందులో పేర్కొన్నారు. భరత్ తెలుగు జాతి గర్వించేలా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Our very own @KonaBharat is debuting today with the Indian Cricket Team in the ongoing test against Australia. My congratulations and best wishes to him.
The Telugu flag continues to fly high!#TeluguPride pic.twitter.com/KlDACbHBhF— YS Jagan Mohan Reddy (@ysjagan) February 9, 2023
కాగా గురువారం నాగ్పూర్లో ఆస్ట్రేలియాతో మొదలైన తొలి టెస్ట్ లో కేఎస్ భరత్ టీమిండియా తరపున అరంగేట్రం చేయగా.. మరోవైపు టీ20 స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా కెరీర్ లో తొలి టెస్టు ఆడుతుండటం విశేషం. ఇక 1993 అక్టోబర్ 3న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించిన శ్రీకర్ భరత్.. 2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో భారత్-ఏ జట్టు సభ్యుడిగా ఉన్న అతడు నేడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ ద్వారా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. కాగా డాషింగ్ బ్యాట్స్మెన్గా పేరొందిన భరత్ను ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ 1.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE