టీటీడీ ఈవో ధర్మారెడ్డిని పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Consoles TTD EO Dharma Reddy Family at Nandyal Today,TTD EO Dharma Reddy,TTD Dharma Reddy,TTD EO Dharma Reddy Family,Mango News,Mango News Telugu,Ap Ex Minister Kodali Nani,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణాధికారి (ఈవో) ఏవీ ధర్మారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి ఆకస్మిక మృతి చెందగా.. సీఎం జగన్ సంతాపం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి గురువారం వారి స్వగ్రామమైన నంద్యాల జిల్లాలోని పారుమంచకు వెళ్లి ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రమౌళి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మారెడ్డితో పాటు ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

కాగా చంద్రమౌళి రెడ్డి అలియాస్ శివ (28) చెన్నైలో బీటెక్ పూర్తి చేసి ముంబైలో ఫైనాన్స్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు చెన్నైకు చెందిన టీటీడీ మండలి సభ్యుడు శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయం అయింది. ఈ క్రమంలో చెన్నైలో బంధువులకు శుభలేఖలు పంచే నిమిత్తమై ఈ నెల 18న కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో పక్కనే ఉన్న ఆయన మిత్రుడు హుటాహుటిన కావేరి ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 3 రోజుల అనంతరం బుధవారం ఉదయం కన్నుమూశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =