ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 5, మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముందుగా మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం సహా పలు ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, విభజన చట్టం హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం, మూడు రాజధానుల ఏర్పాటు, కొత్తగా ఏర్పాటైన 26 జిల్లాలు సహా పలు అంశాలను సీఎం వైఎస్ జగన్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ పర్యటనలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో పాటుగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ