ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించారు. అలాగే ఈ సందర్భంగా ప్రతి బూత్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ పార్టీ సమాయత్తమవుతోంది. ఈ కార్యక్రమంలో తొలుత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్కు నివాళులు అర్పించారు. అలాగే ఏప్రిల్ 11వ తేదీన ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావ్ ఫూలే జయంతిని ఘనంగా జరపాలని పార్టీ భావిస్తోంది.
సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పార్టీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో విధిగా ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్కు చెందిన పలు క్షేత్రాలను సందర్శించాలని ప్రధాని కోరారు. ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ ప్రధానుల మ్యూజియం ప్రారంభిస్తున్నామని తెలిపారు. దీనిద్వారా ఇప్పటివరకు దేశానికీ సేవలందించిన మాజీ ప్రధానులను గౌరవించడం జరుగుతుందని, ఇది ఒక సత్సంప్రదాయంగా భవిష్యత్తులో నిలువనుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు ముఖ్తార్ అబ్బాస్, నఖ్వీ, ప్రహ్లాద్ జోషితో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ