ఆంధప్రదేశ్ రాష్ట్రం త్వరలో కీలక సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. మార్చి 4 వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. అందులో భాగంగా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే ఎజెండా అంశాలపై గురువారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించనున్న అంశాలను అధికారులు సీఎంకు నివేదించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా 26 అంశాలపై చర్చలు జరుగనున్నట్టు అధికారులు వివరించారు. మరోవైపు ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి నుంచి ముఖ్యమంత్రులు, అలాగే అండమాన్ నికోబార్, లక్షద్వీప్ల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ