ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు..
- రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీ పోస్టులను గుర్తించాలి.
- గతంలో వలే ఇప్పుడు కూడా త్వరితగతిన ఆ పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టాలి.
- సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే ఏపీ నంబర్ వన్గా నిలవాలి.
- దీనిని సాధించడం కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సమిష్టిగా కృషి చేయాలి.
- సచివాలయాల్లో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందిపై మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండాలి.
- గ్రామ, వార్డు సచివాలయాలను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డిజి) సాధించే ప్రక్రియలో సమర్థవంతంగా పనిచేసేలా చూడాలి.
- వివిధ శాఖల అధిపతులు నెలలో కనీసం రెండు సెక్రటేరియట్లను సందర్శించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను (ఎస్ఓపి) పరిశీలించాలి.
- అలాగే సాధించిన లక్ష్యాల నెలవారీ రికార్డులను నిర్వహించడం మరియు నవీకరించడంతోపాటు అవసరమైనచోట వాటిని సవరించాలి.
- దీనికోసం కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతను ఉపయోగించాలి.
- ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంలో హాజరును అమలు చేస్తున్నాం.
- దీనిలో భాగంగా ఈ నెలాఖరు నాటికి అన్ని సచివాలయాల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంలో హాజరు అమలు చేయాలి.
- అలాగే అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలి.
- ప్రస్తుతం వైర్లెస్ ఇంటర్నెట్తో నడుస్తున్న 2,909 గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్తో నవీకరించాలి.
- అంగన్వాడీలను సచివాలయాల పరిధిలోకి తీసుకొచ్చి పర్యవేక్షణ చేపట్టాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE