ఏపీ సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (ఏఎంఆర్డీఏ) ని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 13, గురువారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏఎంఆర్డీఏ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా అమరావతి పరిధిలో ప్రస్తుతం నిర్మాణాలు ఏ దశల్లో ఉన్నాయో సీఎం వైఎస్ జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా నిర్మాణాలను పూర్తిచేసే కార్యాచరణపై కీలకంగా చర్చించారు. అందుకోసం నిధుల సమీకరణకు ఆర్థికశాఖ అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధంచేసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే హ్యపీ నెస్ట్ బిల్డింగులను పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఏఎంఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, ఇతర సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu