ఏపీలో పంచాయతీ ఎన్నికలు: వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్

AP SEC Ramesh Kumar to Tour in Uttarandhra and Godavari Districts on February 1, 2

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో నాలుగుదశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాల్లో పర్యటించి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జనవరి 29, 30 తేదీలలో ఆయన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. అలాగే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1 వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో, ఫిబ్రవరి 2 వ తేదీన విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాల పర్యటన సందర్భంగా ఆయా జిల్లాల అధికారులతో ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − two =