ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 12, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 254146 కు చేరింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రోజువారీగా అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా హెల్ప్లైన్ నెంబర్ కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పూర్తిస్థాయి సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్ 82971 04104 నెంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
ఈ హెల్ప్లైన్ నంబర్ కు ఫోన్ చేసినపుడు ఆప్షన్ల ద్వారా కరోనా సమాచారం, వైద్య సహాయం వివరాలు, కోవిడ్ సెంటర్లల్లో ఎలా చేరాలి, సంబంధిత అంబులెన్స్ వివరాలు తెలియనున్నారు. అలాగే కరోనా లక్షణాలుపై అవగాహన పెంచడం, పరీక్షల వివరాలు తెలపడం, హోమ్ ఐసోలేషన్ జాగ్రత్తలు, టెలీమెడిసిన్, 104 కాల్సెంటర్, కోవిడ్ వెబ్ సైట్ వివరాలను కూడా ఈ హెల్ప్లైన్ ద్వారా అందించనున్నారు.
కోవిడ్ కి సంబంధించిన ఎటువంటి సమాచారానికైనా ఇప్పుడు 8297104104 కి ఫోన్ చేసి IVRS ద్వారా తెలుసుకోండి. #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/GeYv0w5m9J
— ArogyaAndhra (@ArogyaAndhra) August 13, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu