ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం, సంగంతో సహా పలు ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. ముఖ్యంగా పోలవరం దిగువ కాఫర్ డ్యాం పనులు జులై 31 నాటికి పూర్తి అవుతాయని అధికారులు తెలిపారు. కాగా పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇంకా రీయంబర్స్ చేయాల్సిన డబ్బు రూ. 2,559.37 కోట్లని, వీలైనంత త్వరగా డబ్బును తెప్పించుకునే ప్రయత్నాలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. నిర్దేశించుకున్న సమయంలోగానే నెల్లూరు, సంగం బ్యారేజీ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
ఎత్తిపోతల ద్వారా గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్కు వంశధార నీళ్లు పంపించే ప్రతిపాదనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికీ చర్యలు తీసుకోవాలని, అలాగే కుప్పం బ్రాంచ్ కెనాల్ను త్వరతిగతిన పూర్తిచేయాలన్న అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇతర ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులపైనా కూడా సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు రాష్ట్ర రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, సీఎస్ డా.సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ