ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ను ఆహ్వనించారు. మే 26న భువనేశ్వర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మరియు మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయని, ముఖ్యఅతిథిగా హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్ కు టీటీడీ తరఫున ఆహ్వాన పత్రిక అందజేసినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే విగ్రహ ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను టీటీడీ తరపున వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ