ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు, వేదపండితులు మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్ జగన్ కు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్, ఈవో అందజేశారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎం వైఎస్ జగన్ కు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అలాగే సీఎంకు స్వామివారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలను కూడా అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE