ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం తాడేపల్లిలోని నివాసంలో విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిశారు. 2023, జనవరి 27వ తేదీ నుంచి 2023, జనవరి 31వ తేదీ వరకు విశాఖలోని శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సీఎం వైఎస్ జగన్ కు అందించారు. ఈ సందర్భంగా సీఎంకు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రసాదాలను అందజేశారు. మరోవైపు వార్షిక మహోత్సవాల్లో భాగంగా శ్రీ శారదా పీఠంలో పలు యాగాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ వివరాలను సీఎం వైఎస్ జగన్ కు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వివరించినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE