ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) హైదరాబాద్ 20 ఏళ్ల ఆవిర్భావ ముంగిపు వేడుకల్లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా చంద్రబాబుకు ఐఎస్బీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాడు హైదరాబాద్లో ఐఎస్బీ ఏర్పాటుకు చంద్రబాబు ఎంతగానో కృషి చేసిన విషయం తెలిసిందే. 2001లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. కాగా రేపు సాయంత్రం 5 గంటలకు ఐఎస్బీ ఆవిర్భావ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఐఎస్బీ విద్యార్థులతో చంద్రబాబు నాయుడు ముఖాముఖీ చర్చలో పాల్గొననున్నారు. ఇక ఐఎస్బీ కోసం అప్పట్లో అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే కేంద్రంలో తన పరపతిని ఉపయోగించి దీనిని హైదరాబాద్ నగరంలో ఏర్పాటయ్యేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ