ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ ముందుగా గవర్నర్ దంపతులను కలిశారు. అనంతరం గవర్నర్ తో దాదాపు గంటసేపు జరిగిన భేటీ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా త్వరలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభలో ప్రవేశపెట్టే బిల్లులు, సీఎం దావోస్ పర్యటన, ఢిల్లీ పర్యటనల వివరాలు, కోనసీమలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు, అక్కడ తాజా పరిస్థితులు సహా పలు ఇతర అంశాలపై ఈ భేటీలో గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం వైఎస్ జగన్ చర్చించినట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY