తెలంగాణ ప్రభుత్వం పీజీ కోర్సులలో చేరే విద్యార్థులకు శుభవార్త వినిపించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ మరియు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీపీగెట్) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, జేఎన్టీయూ హెచ్, మహిళా వర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సోమవారం నోటిఫికేషన్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జులై 4 అని, ఒకవేళ ఏదేని కారణం వలన అలస్యమైతే లేట్ పెనాల్టీ చార్జెస్ చెల్లించి జులై 15 లోపు దరఖాస్తులను పంపించాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. జులై 20 నుంచి ఆన్లైన్లో సీపీగెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు సీపీగెట్ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని, అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాల కోసం అధికారిక వెబ్ పోర్టల్ http://tscpget.com సైట్ ను సందర్శించాలని లింబాద్రి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF