ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో మార్చ్ 30 , సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు అవుతున్న విధానం, తాజా పరిస్థితులను సీఎం వైఎస్ జగన్ గవర్నర్కు వివరించారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గవర్నర్ కార్యాలయంలోకి వెళ్లే ముందు సీఎం వైఎస్ జగన్ శానిటైజర్తో తన చేతులను శుభ్రం చేసుకున్నారు. భేటీ సందర్భంగా కూడా గవర్నర్, సీఎం వైఎస్ జగన్లు సామాజిక దూరం పాటించారు.
మరోవైపు సోమవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్ అమలు జరుగుతున్న విధానం, నిత్యావసర సరుకులు సరఫరా, రేషన్ సరఫరా ఇతర పలు కీలక అంశాలపై సీఎం వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాగా ఏపీలో ఇప్పటివరకూ 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.