కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చ్ 30, సోమవారం ఒక్కరోజే తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.25 కోట్లకు పైగా విరాళాలు అందాయి. పలు సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకుని విరాళానికి సంబంధించిన చెక్కులను అందజేస్తున్నారు.
విరాళాలు అందించిన వారీ వివరాలు:
- హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం అందించింది. దీంతో పాటు మరో రూ. 5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, లోపినవిర్, ఒసెల్టమివిర్) కూడా ప్రభుత్వానికి అందించారు. హెటిరో చైర్మన్ పార్థసారధి రెడ్డి, డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి చెక్కును సీఎం కేసీఆర్ కు అందజేయగా, మందులను రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కు అందించారు.
- తెలంగాణ మోటార్ వెహికిల్స్ ఇన్స్ పెక్టర్ అసోసియేషన్ రూ.1.5 కోట్ల విరాళం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును అసోసియేషన్ అధ్యక్షుడు కె.పాపారావు, తదితరులు సీఎం కేసీఆర్ కు అందించారు.
- సువెన్ ఫార్మా కోటి రూపాయల విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును సువెన్ ఫార్మా చైర్మన్ వెంకట్ జాస్తి సీఎం కేసీఆర్ కు అందించారు
- ఎన్.సి.సి. లిమిటెడ్ కోటి రూపాయల విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును సంస్థ ఎండి ఎ. రంగరాజు సీఎం కేసీఆర్ కు అందజేశారు.
- శ్రీచైతన్య విద్యాసంస్థలు కోటి రూపాయల విరాళం అందించాయి. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ డైరెక్టర్ వై.శ్రీధర్ సీఎం కేసీఆర్ కు అందించారు.
- వాల్యూ లాబ్స్ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ కు రూ.5 కోట్ల చెక్కును అందజేశారు.
- అమరరాజ గ్రూప్ ప్రతినిధులు మంత్రి కేటిఆర్ కు కోటి రూపాయల చెక్కును అందజేశారు.
- ఐసిఎఫ్ఏఐ సోసిటీ – రూ. కోటి విరాళం.
- జివిపీఆర్ ఇంజనీర్స్ – రూ. కోటి విరాళం.
- వంశీ రామ్ బిల్డర్స్ – రూ. కోటి విరాళం.
- సిగ్నిటీ టెక్నాలజీస్ – రూ. 50 లక్షల విరాళం.
- యునైటెడ్ స్టేట్స్ ఫార్మా – రూ. 50 లక్షల విరాళం.
- ఎమ్మెల్సీ నవీన్ కుమార్ – రూ. 25 లక్షలు విరాళం.
- భాష్యం విద్యాసంస్థలు: రూ. 25 లక్షలు విరాళం.
- విమల ఫీడ్స్ – రూ. 25 లక్షలు విరాళం.
- స్వస్తిక్ మిర్చి స్టోర్ – రూ. 21 లక్షలు విరాళం.
- గురునానక్ విద్యా సంస్థలు: రూ. 11 లక్షలు విరాళం.
- హైదరాబాద్ బోట్స్ క్లబ్ – రూ. 10 లక్షలు విరాళం.
- ఏగ్గె మల్లేశం – రూ. 10 లక్షలు విరాళం.
- టిఆర్ఎస్ లీడర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి – రూ. 10 లక్షలు విరాళం.
[subscribe]