అమలాపురం పట్టణంలో నిన్నటి విధ్వంసంలో పాల్గొన్నవారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని, వారు వైసీపీ వారైనా సరే ఉపేక్షించేది లేదని ఏపీ రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ హెచ్చరించారు. ఆందోళనకారులు తగలబెట్టిన అమలాపురం లోని తన ఇంటిని మంత్రి విశ్వరూప్ బుధవారం పరిశీలించారు. నిన్న కోనసీమ పరిరక్షణ సమితి, కోనసీమ సాధన సమితి తదితర సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకారులు నిరసనలు తెలిపారని చెప్తున్నారని, అయితే వారిలో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడ్డాయని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తులో అన్ని నిజాలు బయటకు వస్తాయని, దీనిలో దోషులుగా తేలితే ఏ పార్టీ వారినైనా సరే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
కోనసీమ సాధన సమితి కూడా ఈ తరహా ఘటనలను ఊహించలేదని, నిరసనకారుల ఆందోళనల్లో కొందరు రౌడీషీటర్లు కూడా పాల్గొన్నారని, వారే ఈ విధ్వంసం సృష్టించారని వెల్లడించారు. అలాగే తమ కార్యకర్తలను అదుపు చేయడంలో టీడీపీ, జనసేన పార్టీలు విఫలమయ్యాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తలపెట్టిన నిరసనలు అదుపుతప్పి తీవ్ర విధ్వంసానికి దారితీయటం తెలిసిందే. ఈ క్రమంలో ఆందోళనకారులు కొందరు మంత్రి ఇంటికి నిప్పుపెట్టగా ఇంట్లోని ఫర్నీచర్ మొత్తం కాలి బూడిదైంది. అలాగే మంత్రి ఇంటి ముందు ఉంచిన కొన్ని వాహనాలను కూడా ధ్వంసం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ