ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం మొహర్రం సందర్భంగా సీఎం జగన్ ముస్లిం సోదరులను ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశం విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి ప్రతీకగా ‘మొహర్రం’ నిలిచిందని సీఎం జగన్ తెలిపారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం మొదటి నెల అని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు సీఎం జగన్ తన ట్విట్టర్లో.. “త్యాగానికి ప్రతీక మొహర్రం. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శం. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.
త్యాగానికి ప్రతీక మొహర్రం. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శం. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయి.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY