ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 23 (గురువారం)న తిరుపతి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ గురువారం ఉదయం 09.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు తిరుపతి రూరల్ మండలం పేరూరు చేరుకుని, 11.15-11.45 గంటల వరకు ప్రముఖ శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుంటారు. అక్కడ హిల్టాప్ సెజ్ ఫుట్వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్ నిర్మాణ పనుల ప్రారంభం, భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 3.50 గంటలకు తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY