భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విస్తరిస్తుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 13, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 9152 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 857 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు ఈ వైరస్ వలన 308 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 7987 మంది ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికి ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1985 కు చేరగా, 149 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదైన కరోనా మరణాల్లో సగం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి.
మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య 1000 దాటింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన 21రోజుల లాక్డౌన్ రేపటితో (ఏప్రిల్ 14) ముగియనుంది. ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికే ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ను పొడగిస్తూ నిర్ణయం తీసుకోగా, దేశవ్యాప్త లాక్డౌన్ పై ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
రాష్ట్రాల వారీగా కరోనా కేసుల సంఖ్య:
- ఆంధ్రప్రదేశ్ – 432
- అండమాన్ మరియు నికోబార్ దీవులు – 11
- అరుణాచల్ ప్రదేశ్ – 1
- అస్సాం – 29
- బీహార్ – 64
- చండీఘర్ – 21
- ఛత్తీస్ ఘడ్ – 31
- ఢిల్లీ – 1154
- గోవా – 7
- గుజరాత్ – 538
- హర్యానా – 185
- హిమాచల్ ప్రదేశ్ – 32
- జమ్మూ కాశ్మీర్ – 245
- జార్ఖండ్ – 19
- కర్ణాటక -232
- కేరళ – 376
- లడఖ్ – 15
- మధ్యప్రదేశ్ – 564
- మహారాష్ట్ర – 1985
- మణిపూర్ – 2
- మిజోరం – 1
- ఒడిశా – 54
- పుదుచ్చేరి – 7
- పంజాబ్ – 151
- పశ్చిమ బెంగాల్ – 152
- రాజస్థాన్ – 815
- తమిళనాడు – 1075
- తెలంగాణ – 531
- త్రిపుర – 2
- ఉత్తరాఖండ్ – 35
- ఉత్తర ప్రదేశ్ – 483
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu