ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఎంఫాన్’ తుఫాన్ గండం పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా మరింత బలపడి తీవ్రమైన తుఫాన్గా మారితే ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై భారీ ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేశారు.
‘ఎంఫాన్’ తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. ముఖ్యంగా విద్యుత్తు, వైద్యశాఖ, రెవిన్యూ, పౌరసరఫరాలు శాఖలు అప్రమత్తంగా ఉండి, తుఫాను వలన ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చేప్పారు. మత్స్య కారులు బోట్లలో సముద్రంలోకి వెళ్లకుండా చూడాలని, ఒక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలనీ చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu