కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, జాతీయ స్థాయి పరీక్షలు, పలు రాష్ట్రాల్లో వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష-2020ని కూడా వాయిదా వేస్తున్నట్లు మే 4, సోమవారం నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారం మే 31 న జరగాల్సి వుంది. ఈ వారంలో హాల్ టికెట్స్ జారీ చేస్తారని భావిస్తున్న తరుణంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. తిరిగి పరీక్షను ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయాన్ని మే 20 న ప్రకటించనున్నట్టు యూపీఎస్సీ వెల్లడించింది.
Civil Services (Preliminary) Examination 2020 deferred in the wake of #Lockdown situation. Fresh dates to be notified in due course. #UPSC #DoPT pic.twitter.com/3OrPjp5d57
— Dr Jitendra Singh (@DrJitendraSingh) May 4, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu