జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి తీవ్ర జ్వరంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో యువగళం ముగింపు సభకు పవన్ హాజరవుతారా? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. నారా లోకేష్ చేపట్టిన యువగళం ముగింపు సభ విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో మరికాసేపట్లో జరగనుంది. అయితే ఆ సభకు హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ విజయనగరం వెళ్లాలని ముందుగా భావించారు. ప్రస్తుతం జ్వరంతో ఇబ్బంది పడుతుండడంతో.. యువగళం ముగింపు సభకు గైర్హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE