ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి, సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా రాత్రి 9 గంటలకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వరద సాయం, పోలవరం సహా పలు ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, విభజన చట్టం హామీల అమలు, తదితర అంశాలపై అమిత్ షా తో కీలకంగా చర్చించే అవకాశమునట్టు సమాచారం. అలాగే రేపు కూడా పలువురు కేంద్రమంత్రులతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానునట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ