తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు. ముందుగా రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతికి నివేదిక అందించేందుకు చంద్రబాబు, పార్టీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పయ్యావుల కేశవ్, నక్కా ఆనంద్ బాబు, సహా ఇతర నేతలతో కూడిన టీడీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీ చేరుకుంది. అనంతరం రాష్ట్రపతి భవన్ కు చేరుకొని రామ్నాథ్ కోవింద్ తో టీడీపీ నేతల బృందం భేటీ అయింది.
ఈ సందర్భంగా శాంతిభద్రతలు, గంజాయి, డ్రగ్స్ రవాణా, పార్టీ కార్యాలయాలపై దాడులు సహా పలు అంశాలపై రాష్ట్రపతికి నివేదిక అందించి, ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నేతృత్వంలోని ఈ బృందం రెండు రోజులు పాటుగా ఢిల్లీలో పర్యటించనుండగా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అలాగే స్థానిక అంశాలపై పలువురు కేంద్రమంత్రులతో కూడా టీడీపీ బృందం భేటీ కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ