ఏపీలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, పలుచోట్ల ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాలను నమోదు చేసింది. నెల్లూరు కార్పొరేషన్ లో 54కి గాను 54 డివిజన్లలో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయడంతో పాటుగా, ఆకివీడు, జగ్గయ్యపేట, దాచేపల్లి, గురజాల, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ, మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇక దర్శిలో 20 వార్డులకు గానూ టీడీపీ 13 గెలవగా, వైఎస్సార్సీపీ 7 గెలుచుకుంది. అలాగే కొండపల్లిలో 29 వార్డుల్లో వైఎస్సార్సీపీ 14 చోట్ల, టీడీపీ 14 చోట్ల, ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు.
కాగా తాజా మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు ఘనవిజయం అందించడంపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు… ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ