ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీపై ఏప్రిల్ 24, శుక్రవారం నాడు కీలక ప్రకటన చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8 వ తేదీన రాష్ట్రంలోని 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇళ్ల స్థలాలను మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా ఉచితంగా ఇల్లు కూడా కట్టించి ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతికూల పరిస్థితులకు కారణమైన కరోనా వైరస్ వ్యాప్తి లేకపోతే ఇప్పటికే ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించేవారమని, అన్ని అనుకున్నట్టుగా జరిగితే వైఎస్ఆర్ జయంతి రోజైన జులై 8 న ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు
* జూలై 8న వైఎస్సార్ జయంతి రోజు 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ.
*ఇళ్ల స్థలాలను మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాం.
*ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం.. pic.twitter.com/clRpHoiFO4
— ICCCW Andhra Pradesh (@ICCCWAP) April 25, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu