ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో ఇథనాల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 260 కోట్లు పెట్టుబడితో ఈ ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇక ఈ ప్లాంట్ ద్వారా 300 మంది స్థానికులకు ఉపాధి లభించనుంది. తద్వారా గోకవరం మండల ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది.
కాగా భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అలాగే ఇథనాల్ సరఫరా సంవత్సరం 2022-23 కోసం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (ఈబీపీ) కింద వివిధ చెరకు ఆధారిత ముడి పదార్థాల నుండి తీసుకోబడిన ఇథనాల్ రేట్ల పెంపును ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.మాధవి లత, ఇన్చార్జి ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తదితరులు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా షెడ్యూల్..
- శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ చేరుకుంటారు.
- 9:35కి హెలికాప్టర్లో బయలుదేరి 10:30కి గుమ్మళ్లదొడ్డి గ్రామం చేరుకుంటారు.
- అక్కడి నుంచి 10.40కి అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు సీఎం చేరుకుంటారు.
- ఉదయం 10.45 నుంచి 11.40 గంటల వరకు భూమిపూజ, బహిరంగ సభలో పాల్గొంటారు.
- అనంతరం సభావేదిక నుంచి 11.45కి బయలుదేరి 11.50 గంటలకు గుమ్మళ్లదొడ్డి గ్రామం లోని హెలిప్యాడ్ చేరుకుంటారు.
- మధ్యాహ్నం 12.10 గంటలకు సీఎం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE