ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కర్నూలు జిల్లా అవుకు చేరుకొని దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరోనాకు చికిత్స పొందుతూ ఇటీవలే చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఈ రోజు చల్లా రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి, విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ పర్యటనలో సీఎం వైఎస్ జగన్ తో పాటుగా కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, జిల్లా ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ